మూడు నెలల తర్వాత.. టూరిస్టులకు తలుపులు తెరిచిన ఇటలీ!

ABN , First Publish Date - 2020-06-04T04:45:47+05:30 IST

కరోనాతో అల్లాడిన ఇటలీ దేశం నెమ్మదిగా కోలుకుంటోంది. తాజాగా యూరప్‌ నుంచి వచ్చే టూరిస్టులకు అనుమతులు ఇస్తున్నట్లు ప్రకటించింది.

మూడు నెలల తర్వాత.. టూరిస్టులకు తలుపులు తెరిచిన ఇటలీ!

రోమ్: కరోనాతో అల్లాడిన ఇటలీ దేశం నెమ్మదిగా కోలుకుంటోంది. తాజాగా యూరప్‌ నుంచి వచ్చే టూరిస్టులకు అనుమతులు ఇస్తున్నట్లు ప్రకటించింది. మూడు నెలలపాటు లాక్‌డౌన్‌లో ఉన్న ఇటలీ.. ఇటీవలే లాక్‌డౌన్ ఎత్తేసిన విషయం తెలిసిందే. ఇటలీ వస్తున్న టూరిస్టులు ఇతర దేశాలకు వెళ్లినట్లయితే కొంతకాలం సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండాలని అధికారులు సూచించారు. అలా కాకుండా నేరుగా ఇటలీకి వచ్చే వారికి ఇటువంటి నిబంధనలు లేవు. ఐరోపా ఖండంలో తొలుత కరోనా మహమ్మారి విజృంభించింది ఇటలీలోనే. ఇక్కడ 33వేలకుపైగా ప్రజలకు కరోనాకు బలయ్యారు. 2.3లక్షలపైగా కరోనా కేసులు నమోదయ్యాయి.

Updated Date - 2020-06-04T04:45:47+05:30 IST