Huzurabad: నేటి నుంచి 23 రోజులపాటు ఈటల రాజేందర్ పాదయాత్ర
ABN , First Publish Date - 2021-07-19T12:45:35+05:30 IST
నేటి నుంచి మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ పాదయాత్ర చేయనున్నారు. ‘ప్రజా జీవన యాత్ర’ పేరుతో బీజేపీ నేత ఈటల రాజేందర్ తలపెట్టిన పాదయాత్ర నేడు ప్రారంభం కానుంది. ఉదయం 9.30 గంటలకు హుజూరాబాద్
హుజూరాబాద్: నేటి నుంచి మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ పాదయాత్ర చేయనున్నారు. ‘ప్రజా జీవన యాత్ర’ పేరుతో బీజేపీ నేత ఈటల రాజేందర్ తలపెట్టిన పాదయాత్ర నేడు ప్రారంభం కానుంది. ఉదయం 9.30 గంటలకు హుజూరాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ మండలం బత్తినవారిపల్లిలో పాదయాత్ర ప్రారంభించనున్నారు. తొలి రోజు పాదయాత్రలో నియోజకవర్గంలోని శనిగరం, మాదన్నపేట, గునిపర్తి, శ్రీరాములపేట, అంబల గ్రామాల మీదుగా పాదయాత్ర కొనసాగుతుంది. నియోజకవర్గంలోని వివిధ గ్రామాల మీదుగా 23 రోజుల పాటు ఈటల పాదయాత్ర చేయనున్నారు. మొత్తం 107 గ్రామపంచాయితీల పరిధిలోని 127 గ్రామాల్లో.. 270 కిలోమీటర్లు ఈటల రాజేందర్ పాదయాత్ర చేయనున్నారు.