హవాలా లావాదేవీలు...లక్నోలో ఐటీ దాడులు

ABN , First Publish Date - 2022-01-24T16:13:57+05:30 IST

యూపీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో లక్నోలోని రాకబ్‌గంజ్ ఏరియాలో నలుగురు..

హవాలా లావాదేవీలు...లక్నోలో ఐటీ దాడులు

లక్నో: యూపీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో లక్నోలోని రాకబ్‌గంజ్ ఏరియాలో నలుగురు వ్యాపారవేత్తల నివాసాలపై ఐటీ అధికారులు దాడులు జరిపారు. హవాలా లావాదేవీలు జరుపుతున్నారనే సమాచారం మేరకు దాడులు కొనసాగిస్తున్నట్టు ఉన్నతాధికార వర్గాలు చెబుతున్నాయి. గత శుక్రవారం రాత్రి గోండా జిల్లాలోని బబువా ఔట్ పోస్ట్ పోలీసులు సాగించిన తనిఖీల్లో ఓ కారులో రూ.65 లక్షలు పట్టుపడ్డాయి. ఈ సమాచారం అందడంతో వెంటనే ఐటీ అధికారాలు రంగంలోకి దిగారు. 


కారులోని ఇద్దరు ప్రయాణికులను ప్రశ్నించి, వారి వద్ద పట్టుబడిన సొమ్ము లక్నో నుంచి వచ్చిన హవాలా నిధులుగా గుర్తించామని ఐడీ అధికారులు తెలిపారు. అనంతరం రాకబ్‌గంజ్‌లోని వ్యాపారవేత్తలపై దాడులు జరిపినట్టు చెప్పారు. ఈ దాడుల్లో ఒక వ్యాపారి నుంచి రూ.3 కోట్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే పట్టుబడిన సొమ్ము ఎంత అనేది అధికారులు ఇంకా నిర్ధారించలేదు. ఆదివారం రాత్రి కూడా ఐటీ సోదాలు కొనసాగాయి.

Updated Date - 2022-01-24T16:13:57+05:30 IST