మార్చి 31 వరకు జీఎస్‌టీ వార్షిక రిటర్నుల ఫైలింగ్‌

ABN , First Publish Date - 2021-03-01T06:28:29+05:30 IST

జీఎస్‌టీ వార్షిక రిటర్నుల ఫైలింగ్‌ గడువును ప్రభుత్వం మరోసారి పొడిగించింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక రిటర్నుల ఫైలింగ్‌ గడువును మార్చి 31 వరకు పొడిగించినట్టు ప్రభుత్వం ఆదివారం ప్రకటించింది...

మార్చి 31 వరకు జీఎస్‌టీ వార్షిక  రిటర్నుల ఫైలింగ్‌

  • గడువు పొడిగించిన ప్రభుత్వం


న్యూఢిల్లీ: జీఎస్‌టీ వార్షిక రిటర్నుల ఫైలింగ్‌ గడువును ప్రభుత్వం మరోసారి పొడిగించింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక రిటర్నుల ఫైలింగ్‌ గడువును మార్చి 31 వరకు పొడిగించినట్టు ప్రభుత్వం ఆదివారం ప్రకటించింది. ఇంతకు ముందు ఇందుకు సంబంధించిన గడువును 2020 డిసెంబరు 31 నుంచి ఫిబ్రవరి 28కి పొడిగించారు. అయితే పన్ను చెల్లింపుదారులు వ్యక్తపరిచిన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని 2019-20 సంవత్సరానికి సంబంధించిన జీఎస్టీఆర్‌-9, జీఎస్టీఆర్‌-9సీ సమర్పణకు మార్చి 31 వరకు గడువు పొడిగించినట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. 


Updated Date - 2021-03-01T06:28:29+05:30 IST