ఒకే ఆధార్కు 30 మంది నమోదు నిజమే
ABN , First Publish Date - 2021-06-24T04:53:29+05:30 IST
ఒకే ఆధార్తో 30 మంది రైతుల పేర్లు నమోదు నిజమేనని విచారణలో తేలిందని జిల్లా అధికారులు ప్రకటించారు.
బీమా మాయపై అధికారుల విచారణలో వెల్లడి
ఆంధ్రజ్యోతి కథనానికి స్పందన
ఖాజీపేట, జూన 23: ఒకే ఆధార్తో 30 మంది రైతుల పేర్లు నమోదు నిజమేనని విచారణలో తేలిందని జిల్లా అధికారులు ప్రకటించారు. ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన ‘బీమా మాయ’పై జిల్లా అధికారులు బుధవారం విచారణ చేపట్టారు. ఇందులో భాగంగా మిడుతూరు గ్రా మంలో బుధవారం బీబీహెచ వజ్రశ్రీ, హెచఓ ఈశ్వరప్రసాద్, ఏడీఏ నరసింహారెడ్డి, ఏడీహెచ రవీంద్రనాథరెడ్డి, ఏఓ శివశైలజ నేరుగా రైతు ల వద్దకు వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఒకే ఆధార్నంబరుతో దాదాపు 30 మంది రైతుల బీమా నమోదు జరిగిం దని విచారణలో తేలిందన్నారు. అన్యాయం జరిగిన రైతులకు న్యాయం చేస్తామని తెలిపారు. సంబంధిత ఉద్యోగులపై ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తామని శాఖాపర చర్యలు తీసుకుంటామని తెలిపారు.