అది ప్రజావంచన సభ : జక్కలి

ABN , First Publish Date - 2022-08-20T06:05:17+05:30 IST

టీఆర్‌ఎస్‌ నిర్వహించే ప్రజాదీవెన సభ ప్రజా వంచన సభ అని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కలి ఐలయ్య యాదవ్‌ విమర్శించారు.

అది ప్రజావంచన సభ : జక్కలి
చండూరులో రాస్తారోకో చేస్తున్న టీడీపి నాయకులు

చండూరు, ఆగస్టు 19: టీఆర్‌ఎస్‌ నిర్వహించే ప్రజాదీవెన సభ ప్రజా వంచన సభ అని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కలి ఐలయ్య యాదవ్‌ విమర్శించారు. నియోజకవర్గ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌చేస్తూ చండూరులో శనివారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గతంలో సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీలను విస్మరించార న్నారు. మంత్రి జగదీ్‌షరెడ్డి కల్యాణలక్ష్మీ చెక్కులు పంపిణీ తప్ప ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని ప్రశ్నించారు. వ్యక్తిగత ఆరోపణలపై పరిమితమైన టీఆర్‌ఎస్‌, బీజేపి, కాంగ్రెస్‌ ప్రజాసంక్షేమాన్ని మరిచాయన్నారు. గట్టుప్పల మండలాన్ని ప్రకటించి నేటికీ ప్రారంభించకపోవడం ఎన్నిక ఎత్తుగడలో భాగమేనన్నారు. కార్యక్రమంలో నాయకులు ఎర్రజెల్ల లింగయ్య, నల్ల సత్యనారాయణ, గోసుకొండ వెంకటేష్‌, జిన్నా, ఎండీ.షరిఫ్‌, ఎండీ.యూనుస్‌, వేణుగోపాల్‌, పగడాల లింగయ్య, దోమల వెంకన్న, గంట ఆంజనేయులు, పాల్గొన్నారు. 


మిర్యాలగూడను జిల్లాగా ప్రకటించకుంటే బరిలో ఉంటాం

 మిర్యాలగూడను జిల్లాగా ప్రకటించకుంటే మునుగోడులో పోటీచేస్తామని మిర్యాలగూడ జిల్లా సాధన సమితి నేతలు స్పష్టం చేశారు. శుక్రవారం స్థానికంగా విలేకరుల సమావేశంలో సమితి నాయకులు బెజ్జం సాయి, తాళ్లపల్లి రవి, ఫారూక్‌, మాడుగుల శ్రీనివాస్‌ మాట్లాడుతూ మిర్యాలగూడను జిల్లాగా మార్చాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2022-08-20T06:05:17+05:30 IST