‘ఉద్యోగులను వేధించడం సరికాదు’

ABN , First Publish Date - 2022-01-28T06:01:04+05:30 IST

పీఆర్‌సీ విషయంలో ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం వేధించడం సరికాదని కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి నీలకంఠప్ప అన్నారు.

‘ఉద్యోగులను వేధించడం సరికాదు’

ఆదోని టౌన్‌, జనవరి 27: పీఆర్‌సీ విషయంలో ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం వేధించడం సరికాదని కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి నీలకంఠప్ప అన్నారు. గురువారం విలేఖరులతో మాట్లాడుతూ గత ప్రభుత్వాలు వేతనాలు పెంచితే.. ప్రస్తుత ప్రభుత్వం తగ్గించడం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రం లోటు బడ్జెట్‌లో ఉండగా 26 జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనలో అర్థం లేదని విమర్శించారు. మాజీ మార్కెట్‌ యార్డు చైర్మన్‌ దేవిశెట్టిప్రకాష్‌, యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు మారుతిరావు, సాయినాథ్‌, వీరేష్‌, రాము, జయరాం, మనియర్‌ ఇర్ఫాన్‌, మద్దిలేటి పాల్గొన్నారు.

Updated Date - 2022-01-28T06:01:04+05:30 IST