ప్రాథమిక విద్యను నిర్వీర్యం చేయడం తగదు
ABN , First Publish Date - 2022-05-22T05:30:00+05:30 IST
ప్రాథమిక విద్య ను నిర్వీర్యం చేసే విధానాలకు ప్రభుత్వం స్వస్తి పలకాలని ఎస్టీ యూ జిల్లా అధ్యక్షుడు జి. జగన్మో హన్రెడ్డి డిమాండ్ చేశారు.
ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి
పీలేరు, మే 22: ప్రాథమిక విద్య ను నిర్వీర్యం చేసే విధానాలకు ప్రభుత్వం స్వస్తి పలకాలని ఎస్టీ యూ జిల్లా అధ్యక్షుడు జి. జగన్మో హన్రెడ్డి డిమాండ్ చేశారు. ఆది వారం ఎస్టీయూ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయ న మాట్లాడుతూ పాదయాత్ర సంద ర్భంగా ప్రతి ప్రాథమిక పాఠశాలకు కనీసం ఇద్దరు ఉపాధ్యాయులు ఉం డేవిధంగా చర్యలు తీసుకుంటామని విపక్షనేతగా ప్రస్తుతముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చెప్పారన్నారు. అంతేకాకుండా 80 మంది విద్యార్థులకు ఐదుగురు ఉపాధ్యాయులు ఉండే ఆదర్శ ప్రాథమిక పాఠశాల వ్యవస్థను రద్దు చేసి ప్రతి ప్రాథమిక పాఠశాలకు రెండు పోస్టులకే కుదిరించారని అయితే ఈ వ్యవస్థను కూడా రద్దు చేయాలని భావించడం దారుణమన్నారు. ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయకపోవడంతో రాష్ట్రంలో తొమ్మిది వేలకు పైగా పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠఽశాలలుగా మారిపోయాయన్నా రు. ప్రాథమిక విద్యను బలోపేతం చేయడానికి ప్రతి పాఠశాలకు కనీసం ఇద్దరు ఉపాధ్యాయులు ఉండేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఎస్టీయూ నాయకులు మోహన్, డాక్టర్ జనార్ధన్రెడ్డి, అమరనాధరెడ్డి పాల్గొన్నారు.