బెదిరింపులకు పాల్పడడం తగదు
ABN , First Publish Date - 2021-03-04T05:16:12+05:30 IST
మునిసిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రతిపక్ష పార్టీ నాయకులను భయబ్రాంతులకు గురిచేయడం, బెదిరించడం ఎంతవరకు సమంజసమని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ బొబ్బిలి మునిసిపాలిటీ ఇన్చార్జి మీసాల గీత ప్రశ్నించారు.
బొబ్బిలి (రామభద్రపురం), మార్చి 3: మునిసిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రతిపక్ష పార్టీ నాయకులను భయబ్రాంతులకు గురిచేయడం, బెదిరించడం ఎంతవరకు సమంజసమని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ బొబ్బిలి మునిసిపాలిటీ ఇన్చార్జి మీసాల గీత ప్రశ్నించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు తమ ఓటు ద్వారా బుద్ధిచెప్పాలన్నారు. బుధ వారం బొబ్బిలి కోటలో విలేఖర్లతో మాట్లాడారు. నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నా పట్టించుకోక పోవడం దారుణమన్నారు. ఇంటింటికీ సన్నబియ్యం ఇస్తా నని హామీ ఇచ్చి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రాన్ని పక్కా ప్రణాళికతో అభివృద్ధి చేసే టీడీపీ ప్రభుత్వం మళ్లీ రావాల్సిన ఆవ శ్యకత ఎంతైనా ఉందన్నారు. బొబ్బిలిలోని అన్ని వార్డుల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని ఆమె కోరారు. టీడీపీ బొబ్బిలి నియోజకవర్గ ఇన్చార్జ్జి బేబీనాయన, రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి తెంటు లక్ష్ముంనాయుడు పాల్గొన్నారు.