వైద్యులపై దాడి చేయడం తగదు : ఐఎంఏ
ABN , First Publish Date - 2021-06-19T05:38:59+05:30 IST
ప్రాణాలు పణంగా పెట్టి వైద్యసేవలందిస్తున్న వైద్యులపై దాడి చేయడం తగదని ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ రామ్మోహన్ ఆవేదన వ్యక్తం చేశారు.
సిద్దిపేట టౌన్, జూన్ 18: ప్రాణాలు పణంగా పెట్టి వైద్యసేవలందిస్తున్న వైద్యులపై దాడి చేయడం తగదని ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ రామ్మోహన్ ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం సిద్దిపేటలో వైద్యులపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఐఎంఏ ఇచ్చిన పిలుపు మేరకు ప్రైవేట్, ప్రభుత్వ వైద్యులు స్థానిక ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి అనుబంధ మెడికల్ కళాశాల వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం అదనపు కలెక్టర్ ముజామిల్ ఖాన్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వైద్యులు భీమేశ్, గణేశ్, శ్రీనివాస్, సుగుణసతీశ్, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ తమిళ అరసి, సూపరింటెండెంట్ జయశ్రీ, ఐఎంఏ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.