టీడీపీ హయాంలోనే మైనార్టీలకు మేలు
ABN , First Publish Date - 2020-10-01T07:46:06+05:30 IST
టీడీపీ ప్రభుత్వ హయాంలోనే మైనార్టీలకు మేలులు జరిగాయని ఆ పార్టీ మైనార్టీ సెల్ నాయకుడు షేక్ సుభాన్ అన్నారు. ప్రెస్క్లబ్లో బుధవారం విలేకర్ల
మైనార్టీ సెల్ నాయకుడు షేక్ సుభాన్
రాజమహేంద్రవరం సిటీ, సెప్టెంబరు 30: టీడీపీ ప్రభుత్వ హయాంలోనే మైనార్టీలకు మేలులు జరిగాయని ఆ పార్టీ మైనార్టీ సెల్ నాయకుడు షేక్ సుభాన్ అన్నారు. ప్రెస్క్లబ్లో బుధవారం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీని వీడి వెళ్తున్న వారంతా అవాకులు,చవాకులు పేలితే మత్రం ఊరుకునేది లేదని హెచ్చరించారు. టీడీపీ హయాంలోనే దానవాయిపేట మసీదు అభివృద్ధికి రూ.50 లక్షలు, ఉర్ధూఘర్కు రూ.25 లక్షలు, రెహ్మత్ నగర్ మసీదుకు రూ.83 లక్షలు, ఈద్గాకు రూ.25 లక్షలు, అయేషా జల్జలీల్ మసీదుకు రూ.25 లక్షలు నిధులు మంజూరు చేసి టెండర్లు పిలిచేందుకు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు కృషి చేశారన్నారు.
వైసీపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే ఈ పనులను పూర్తి చేయాలని ఆయన సవాల్ విసిరారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి కుంటుపడిందని, మైనార్టీలకు న్యాయం జరగలేదన్నారు. గత ప్రభుత్వం 200 మందికి కుట్టు శిక్షణ ఇప్పించి మిషన్లు సిద్ధం చేస్తే వాటిపై చంద్రబాబు స్టిక్కర్లు తీసేసి సీఎం జగన్ స్టిక్కర్లు అంటించడం సిగ్గుచేటని సుభాన్ అన్నారు. సమావేశంలో మైనార్టీ నాయకులు మహబూబ్ జానీ, అబ్దూలా పాల్గొన్నారు.