రాయచోటిని అన్నమయ్య జిల్లాగా ప్రకటించడం హర్షణీయం

ABN , First Publish Date - 2022-01-28T05:05:32+05:30 IST

రాష్ట్రంలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా రాయచోటి కేంద్రంగా అన్నమయ్య జిల్లా ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేస్తూ గురువారం రాయచోటి పట్టణ పురవీధుల్లో వైసీపీ నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు.

రాయచోటిని అన్నమయ్య జిల్లాగా ప్రకటించడం హర్షణీయం
సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్న వైసీపీ నేతలు

రాయచోటిటౌన్‌, జనవరి 27: రాష్ట్రంలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా రాయచోటి కేంద్రంగా అన్నమయ్య జిల్లా ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేస్తూ గురువారం రాయచోటి పట్టణ పురవీధుల్లో వైసీపీ నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు స్థానిక మున్సిపల్‌ కార్యాలయం నుంచి వైఎ్‌సఆర్‌ సర్కిల్‌ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి ముఖ్యమంత్రి జగన్‌, ఎంపీ మిథున్‌రెడ్డి, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి, ప్రభుత్వ అదనపు కార్యదర్శి ధనుంజయరెడ్డిలకు జేజేలు పలుకుతూ ప్లకార్డులు చేతబట్టి ఆనందోత్సాహాల మధ్య కృతజ్ఞత ర్యాలీ చేపట్టారు.  కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ ఫయాజ్‌బాషా, వైస్‌ చైర్మన్‌ ఫయాజుర్‌ రెహమాన్‌, వైసీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ పి.మదన్‌మోహన్‌రెడ్డి, జడ్పీటీసీ వెంకటేశ్వర్లరెడ్డి, పీఆర్‌టీయూ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు కొండూరు శ్రీనివాసరాజు, వైసీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు. 

 

Updated Date - 2022-01-28T05:05:32+05:30 IST