అది కామన్‌సెన్స్: ఆంథోనీ ఫౌసీ

ABN , First Publish Date - 2021-01-27T01:34:59+05:30 IST

అమెరికా అంటువ్యాధుల నిపుణుడు ఆంథోనీ ఫౌసీ ముఖానికి మాస్క్ ధరించడం విషయమై కీలక వ్యాఖ్యలు చేశారు.

అది కామన్‌సెన్స్: ఆంథోనీ ఫౌసీ

వాషింగ్టన్: అమెరికా అంటువ్యాధుల నిపుణుడు ఆంథోనీ ఫౌసీ ముఖానికి మాస్క్ ధరించడం విషయమై కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు మాస్కులు ధరించడం వల్ల కొవిడ్-19 నుంచి అధిక రక్షణ ఉంటుందనేది కామన్‌సెన్స్ అని అన్నారు. 'ఒక లేయర్ మాస్క్ ధరించడం వల్ల కరోనా నుంచి రక్షణ ఉంటుందని తెలిసినప్పుడు.. దానిపై నుంచి మరో లేయర్ వేసుకోవడం వల్ల అది మరింత సమర్థవంతంగా తయారవుతుందనేది కామన్‌సెన్స్' అని బైడెన్ చెప్పుకొచ్చారు. ప్రజలు డబుల్ మాస్క్ ధరిస్తే మహమ్మారి నుంచి మరింత రక్షణ పొందినట్లేనని అన్నారు. ఇదిలాఉంటే.. అగ్రరాజ్యంలో స్వైర విహారం చేస్తున్న మహమ్మారి ఇప్పటికే రెండున్నర కోట్ల మందికి సోకగా.. ఇందులో 4లక్షలకు పైగా మందిని పొట్టనబెట్టుకుంది.     

Updated Date - 2021-01-27T01:34:59+05:30 IST