అందుకు మూడు రాజధానుల నాటకం: సుంకర పద్మశ్రీ
ABN , First Publish Date - 2022-03-04T00:45:17+05:30 IST
రాష్ట్రంలోని ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలని జగన్ కంకణం
విజయవాడ: రాష్ట్రంలోని ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలని జగన్ కంకణం కట్టుకున్నారని కాంగ్రెస్ నేత సుంకర పద్మశ్రీ అన్నారు. అందుకే మూడు రాజధానుల నాటకానికి తెర తీశారని ఆమె ఆరోపించారు. అమరావతిపై హైకోర్టు తీర్పును తాము స్వాగతిస్తున్నామన్నారు. ఇది అమరావతి రైతులు, 5 కోట్ల ఆంధ్రుల విజయమని ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రతిష్టకు పోకుండా హైకోర్టు తీర్పును అమలు చేయాలని ఆమె సూచించారు.