స్వర్ణం తెచ్చిన తరువాత నీరజ్ కామెంట్స్ ఇవే..
ABN , First Publish Date - 2021-08-08T02:16:16+05:30 IST
టోక్యో ఒలింపిక్స్లో భారత్కు తొలి స్వర్ణం అందించిన నీరజ్ చోప్రా ఈ అద్భుత విజయంపై తొలిసారిగా స్పందించాడు.
ఇంటర్నెట్ డెస్క్: టోక్యో ఒలింపిక్స్లో భారత్కు తొలి స్వర్ణం అందించిన నీరజ్ చోప్రా ఈ అద్భుత విజయంపై తొలిసారిగా స్పందించాడు. ‘‘ఇది నేను నమ్మలేకపోతున్నాను’’ అంటూ కామెంట్ చేశాడు. ‘‘అథ్లెటిక్స్లో భారత్కు స్వర్ణం రావడం ఇదే తొలిసారి. ఇవి నాకు, దేశానికి గర్వించదగ్గ క్షణాలు’’ అని కామెంట్ చేశాడు. స్వర్ణం వస్తుందని ముందే ఊహించారా..? అని అడగ్గా..ఇంతటి విజయం లభిస్తుందని ఊహించలేదని చెప్పుకొచ్చాడు. ‘‘క్వాలిఫికేషన్ రౌండ్లో మంచి ప్రదర్శన చేశా. ఫైనల్స్లోనూ బాగానే ఆడతానని అనుకున్నా. కానీ స్వర్ణం వస్తుందని ఊహించలేదు. చాలా చాలా సంతోషంగా ఉంది.’’ అని నీరజ్ పేర్కొన్నాడు. ‘‘నా పతకాన్ని మిల్కా సింగ్కు అంకితమిస్తున్నా. మిల్కా సింగ్, పీటీ ఉషతోపాటు.. ఒలింపిక్స్ పతకానికి కొద్ది దూరంలో నిలిచిపోయిన భారత క్రీడాకారులకు నా పతకం అంకితం’’ అని పేర్కొన్నాడు. నేడు జరిగిన జావెలిన్ త్రో ఫైనల్స్లో నీరజ్.. ఈటెను అత్యధికంగా 87.58మీటర్ల దూరానికి విసిరి స్వర్ణాన్ని సాధించిన విషయం తెలిసిందే.