ఎల్టీసీ క్యాష్ ఓచర్ పథకం కింద అందరికీ ఐటీ మినహాయింపు
ABN , First Publish Date - 2020-10-30T06:35:04+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేట్, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకూ ఎల్టీసీ క్యాష్ ఓచర్ పథకం కింద ఐటీ మినహాయింపు కల్పించనున్నట్లు సీబీడీటీ ప్రకటించింది...
న్యూఢిల్లీ: రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేట్, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకూ ఎల్టీసీ క్యాష్ ఓచర్ పథకం కింద ఐటీ మినహాయింపు కల్పించనున్నట్లు సీబీడీటీ ప్రకటించింది. ఇదివరకు నిర్ణయించిన ప్రకారం.. ఈ పథకం కింద చెల్లించే రూ. 36,000 వరకు నగదు అలవెన్సుపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే ఐటీ మినహాయింపునిచ్చారు. ఈ రాయితీని అన్ని విభాగాల ఉద్యోగులకు వర్తింపజేస్తున్నట్లు తెలిపింది.