సీఎస్ సోమేశ్ కుమార్ ను కలిసిన ఈస్తోనియా అంబాసిడర్

ABN , First Publish Date - 2021-03-05T22:02:11+05:30 IST

ఈస్తోనియా అంబాసిడర్ కేత్రిన్ కివీ, డిప్యూటి చీఫ్ ఆఫ్ మిషన్ జూయ్ హియో శుక్రవారం

సీఎస్ సోమేశ్ కుమార్ ను కలిసిన ఈస్తోనియా అంబాసిడర్

హైదరాబాద్: ఈస్తోనియా అంబాసిడర్ కేత్రిన్ కివీ, డిప్యూటి చీఫ్ ఆఫ్ మిషన్  జూయ్ హియో శుక్రవారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎస్ సోమేశ్ కుమార్  ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నాయకత్వంలో ప్రభుత్వం అమలు చేస్తున్నపలు సంస్కరణలను ఈస్తోనియా డెలిగేట్స్ కు వివరించారు. అందులో భాగంగా చేపట్టిన ల్యాండ్ రికార్డ్స్ డిజిటలైజేషన్ , ఇ-గవర్నెన్స్ , సైబర్ సెక్యూరిటీ, అభివృద్ది మరియు సంక్షేమ పథకాల గురించి తెలిపారు.


రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు కల్పించిన అవకాశాలను ఉపయోగించుకుని, తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని ఈస్తోనియా డెలిగేట్స్ కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సూచించారు. ఈ కార్యక్రమంలో ఐ.టి. శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి రిజ్వీ, ప్రోటోకాల్ జాయింట్ సెక్రటరి అర్విందర్ సింగ్ తదితర అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-05T22:02:11+05:30 IST