హైదరాబాద్: నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్కు నాన్బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు నాన్బెయిలబుల్ వారెంట్ను జారీ చేసింది. కేసీఆర్, కేటీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో కోర్టులో కేసు విచారణకు హాజరుకాలేదని అర్వింద్కు వారెంట్ జారీ అయింది. 2020 నవంబర్ 23న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అర్వింద్పై కేసు నమోదయింది. టీఆర్ఎస్ నేతల ఫిర్యాదుతో బంజారాహిల్స్ పీఎస్లో అర్వింద్పై కేసు ఫైల్ అయింది. తదుపరి కేసు విచారణను ఈనెల 28కి నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు వాయిదా వేసింది.
ఇవి కూడా చదవండి