ఇస్త్రో ప్రైవేటీకరణపై వామపక్షాలు ఫైర్

ABN , First Publish Date - 2020-07-08T23:53:50+05:30 IST

ఇస్రో ప్రైవేటీకరణపై వామపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కేంద్రం తీరుకు నిరసనగా గురువారం నాడు ఇస్రో ముట్టడికి సీపీఐ

ఇస్త్రో ప్రైవేటీకరణపై వామపక్షాలు ఫైర్

విజయవాడ: ఇస్రో ప్రైవేటీకరణపై వామపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కేంద్రం తీరుకు నిరసనగా గురువారం నాడు శ్రీహరికోటలోని ఇస్రో కేంద్రం ముట్టడికి సీపీఐ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ జాతీయ నేత నారాయణ మీడియాతో మాట్లాడారు. జాతికే గర్వకారణమైన ఇస్రోను ప్రైవేటీకరించడం సరికాదన్నారు. మోదీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్కొక్కటిగా నిర్వీర్యం చేస్తోందని ఆయన ధ్వజమెత్తారు.

Updated Date - 2020-07-08T23:53:50+05:30 IST