జేఎన్‌టీయూ పూర్వ విద్యార్థి పేరుతో ఇస్రో మైస్టాంప్‌

ABN , First Publish Date - 2022-06-25T18:15:40+05:30 IST

అనంతపురం జేఎన్‌టీయూ కళాశాల ఇంజనీరింగ్‌ పూర్వ విద్యార్థిని కె.కళ్యాణి పేరిట ఇస్రో మైస్టాంప్‌ను విడుదలచేసింది. ఈ సదర్భంగా వీసీ రంగజనార్దన హర్షం..

జేఎన్‌టీయూ పూర్వ విద్యార్థి పేరుతో ఇస్రో మైస్టాంప్‌

అనంతపురం సెంట్రల్‌, జూన్‌ 24: అనంతపురం జేఎన్‌టీయూ కళాశాల ఇంజనీరింగ్‌ పూర్వ విద్యార్థిని కె.కళ్యాణి పేరిట ఇస్రో మైస్టాంప్‌ను విడుదలచేసింది. ఈ సదర్భంగా వీసీ రంగజనార్దన  హర్షం వ్యక్తంచేశారు. ఇస్రోలో సైంటిస్ట్‌గా పనిచేస్తున్న కళ్యాణి, ఇ-మార్స్‌ ఆర్బిటరీ మిషన్‌ (ఎంఓఎం) లైమన్‌ ఆల్ఫా ఫొటోమీటర్‌ డెవల్‌పమెంట్‌ ప్రాజెక్ట్‌ల్లో ప్రతిభ కనబరిచారని వీసీ తెలిపారు. దీనికి గుర్తింపుగా పోస్టల్‌  శాఖ సహకారంతో కళ్యాణి పేరుతో ఇస్రో మైస్టాం్‌పను విడుదల చేసిందని వెల్లడించారు. 2002లో బీటెక్‌ విద్యార్థిగా గోల్డ్‌మెడల్‌ పొందిన కళ్యాణి, 2003లో ఇస్రోలో ఉద్యోగం సాధించారని అన్నారు.

Updated Date - 2022-06-25T18:15:40+05:30 IST