ఫైర్ బెలూన్లతో దాడి: ఫిలిప్పీన్స్పై ఇజ్రాయెల్ ఆగ్రహం!
ABN , First Publish Date - 2021-08-24T17:27:34+05:30 IST
ఇజ్రాయెల్, ఫిలిప్పీన్స్ మద్య మరోమారు ఉద్రిక్త పరిస్థితులు....
జరూసలెం: ఇజ్రాయెల్, ఫిలిప్పీన్స్ మద్య మరోమారు ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఫిలిఫ్పీన్స్కు చెందిన ఉగ్రవాదులు ఫైర్ బెలూన్లతో దాడికి పాల్పడిన నేపధ్యంలో ఇజ్రాయెల్ సైనికులు గాజాపై ఎయిర్ స్ట్రయిక్కు దిగారు. అయితే ఈ దాడుల్లో ప్రాణ నష్టం జరిగినట్లు ఇంతవరకూ సమాచారమేదీ లేదు. వారంతంలో చోటుచేసుకున్న ఘర్షణల అనంతరం ఇక్కడి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయని తెలుస్తోంది. ఇజ్రాయెట్ డిఫెన్స్ ఫోర్స్ ఈ దాడుల ఘటన నిజమేనని స్పష్టం చేసింది. దీనికి ముందు ఆగస్టు 21న కూడా ఇటువంటి ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఆయుధాలు ధరించిన ఫిలిప్పీన్స్ పౌరుడు... ఇజ్రాయెల్ స్నయిపర్పై కాల్పులు జరిపాడు. ఈ ఘటన అనంతరం ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.