జిల్లా కేంద్రంలో ఐసోలేషన్ కేంద్రం ఏర్పాటు చేయాలి
ABN , First Publish Date - 2020-07-04T10:32:53+05:30 IST
మంచిర్యాల జిల్లా కేంద్రం, పరిసర ప్రాంతంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో స్థానికంగా ఐసోలేషన్ కేంద్రా న్ని ఏర్పాటు
మంచిర్యాల అర్బన్, జూలై 3 : మంచిర్యాల జిల్లా కేంద్రం, పరిసర ప్రాంతంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో స్థానికంగా ఐసోలేషన్ కేంద్రా న్ని ఏర్పాటు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్ కోరారు. శుక్ర వారం కలెక్టర్ భారతి హొళికేరిని కలిసి వినతిపత్రం అందజేశారు. కరోనా బాధి తులు వైద్య సౌకర్యం కోసం దూర ప్రాంతానికి వెళ్ళి అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు. పట్టణంలోని హైటెక్సిటీలో గల క్లబ్ను ఐసోలేషన్ కేంద్రంగా మార్చా లని ఆయన కలెక్టర్కు విన్నవించారు. కరోనా వ్యాధి పూర్తిగా నయమయ్యే వరకు క్లబ్ సముదాయాన్ని ఐసోలేషన్ కేంద్రంగా ఏర్పాటు చేసి కరోనా బాధితుల కష్టాల ను తీర్చాలని, అందుబాటులో వైద్య సేవలు ఉండటం వల్ల ప్రజలకు ఎంతో సౌల భ్యంగా ఉంటుందని తెలిపారు.