12 డిగ్రీ కాలేజీలకు ఐఎస్వో సర్టిఫికేషన్
ABN , First Publish Date - 2021-05-06T06:46:30+05:30 IST
ఎస్వీయూనివర్సిటీ పరిధిలోని 12 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలకు ఐఎస్వో గుర్తింపు లభించింది.
తిరుపతి (విశ్వవిద్యాలయాలు), మే 5: ఎస్వీయూనివర్సిటీ పరిధిలోని 12 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలకు ఐఎస్వో గుర్తింపు లభించింది. ఈ కాలేజీలు చేపట్టిన అడ్మిషన్లు, బోధన, వసతులు, ఉపాధి అవకాశాలు వంటి పలు అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ గుర్తింపును ప్రకటించారు. ఇందులో పుత్తూరు, నగరి, శ్రీకాళహస్తి, చిత్తూరులోని మహిళా, పురుష డిగ్రీ కాలేజీలు, కార్వేటినగరం, పీలేరు, పుంగనూరు, వాయల్పాడు, మదనపల్లె, పలమనేరు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలున్నాయి. దీనివల్ల యూజీసీ నాక్ గుర్తింపుతోపాటు, ఇక్కడ చదివిన విద్యార్థులకు ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయి. దీనిపై ఎస్వీయూ వీసీ రాజారెడ్డి, రెక్టార్ సుందరవల్లి, రిజిస్ట్రార్ శ్రీధర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.