ఇస్నాపూర్లో ఘోర రోడ్డుప్రమాదం.. అక్కడికక్కడే ముగ్గురి మృతి
ABN , First Publish Date - 2022-01-06T03:31:03+05:30 IST
పటాన్చెరులోని ఇస్నాపూర్లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఆటోను టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో అక్కడికక్కడే..
సంగారెడ్డి: పటాన్చెరులోని ఇస్నాపూర్లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఆటోను టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. క్షతగాత్రుడ్ని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. టిప్పర్ లారీ అతివేగం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు అంటున్నారు. టిప్పర్ లారీ డ్రైవర్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. టిప్పర్ నెంబర్ ఆధారంగా వివరాలు సేకరించారు. లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు. రోడ్డు రూల్స్ ప్రతి ఒక్కరూ పాటించాలని, అతివేగంతో వాహనాలు నడపొద్దని పోలీసులు సూచించారు.