ఐఎస్ఎల్ డేట్స్ విడుదల.. కరోనా తర్వాత దేశంలో భారీ ఈవెంట్ ఇదే!

ABN , First Publish Date - 2020-10-31T02:54:33+05:30 IST

కరోనాతో అటకెక్కిన క్రీడాలోకం మెల్లగా మళ్లీ పూర్వస్థితికి చేరుకుంటోంది. ఇప్పటికే ప్రేక్షకులు లేకుండా ఐపీఎల్ వంటి భారీ టోర్నీలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

ఐఎస్ఎల్ డేట్స్ విడుదల.. కరోనా తర్వాత దేశంలో భారీ ఈవెంట్ ఇదే!

న్యూఢిల్లీ: కరోనాతో అటకెక్కిన క్రీడాలోకం మెల్లగా మళ్లీ పూర్వస్థితికి చేరుకుంటోంది. ఇప్పటికే ప్రేక్షకులు లేకుండా ఐపీఎల్ వంటి భారీ టోర్నీలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే భారత్‌లో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో దేశంలో ఎటువంటి క్రీడా కార్యకలాపాలకూ అనుమతి లభించలేదు. అయితే కరోనాతో మూలపడిన క్రీడా కార్యకలాపాలకు ఇప్పుడిప్పుడే అనుమతులు లభిస్తున్నాయి. ప్రేక్షకులు లేకుండా టోర్నీలు నిర్వహించడానికి ప్రభుత్వం అనుమతినిస్తోంది. ఈ క్రమంలోనే హీరో ఇండియన్ సూపర్ లీగ్‌(ఐఎస్ఎల్) 2020-21 ఎడిషన్‌ కూడా నిర్వహించాలని ఫుట్‌బాల్ స్పోర్ట్స్ డెవలెప్‌మెంట్ లిమిటెడ్ నిర్ణయించింది. ఐఎస్ఎల్ షెడ్యూల్‌ను శుక్రవారం విడుదల చేసింది. నవంబరు 20న గోవాలోని జీఎంసీ స్టేడియంలో తొలి మ్యాచ్ జరగనుంది. దీనిలో డిఫెండింగ్ ఛాంపియన్ ఏటీకే మోహున్ బగన్, కేరళ బ్లాస్టర్స్ ఎఫ్‌సీ జట్లు తలపడనున్నాయి. ఈ టోర్నీ గనుక ప్రారంభమైతే కరోనా విలయం తర్వాత దేశంలో జరిగే భారీ స్పోర్ట్స్ ఈవెంట్ ఇదేకానుంది.

Updated Date - 2020-10-31T02:54:33+05:30 IST