ఐఎ్సబీ నం.1
ABN , First Publish Date - 2022-06-24T06:48:32+05:30 IST
దేశంలోనే నెంబర్ వన్ బిజినెస్ స్కూల్గా ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎ్సబీ) నిలిచింది.
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): దేశంలోనే నెంబర్ వన్ బిజినెస్ స్కూల్గా ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎ్సబీ) నిలిచింది. ఆసియాలో 5వ ర్యాంక్ను, ప్రపంచంలో 75వ ర్యాంక్ను సంపాదించింది. ‘ఎకనమిస్ట్’ రూపొందించిన ర్యాకింగ్ జాబితాలో ఐఎ్సబీకి ఈ గౌరవం దక్కిందని ఐఎ్సబీ డిప్యూటీ డీన్ (అకడమిక్ ప్రోగ్రామ్స్) రామభద్రన్ తిరుమలై తెలిపారు. ‘విచ్ ఎంబీఏ.. ఫుల్-టైమ్ ఎంబీఏ ర్యాంకింగ్ 2022’ పేరుతో ఎకనమిస్ట్ ర్యాంకింగ్ జాబితాను తయారు చేసింది. కొత్త కెరీర్ అవకాశాలు, వ్యక్తిగత అభివృద్ధి, విద్యా అనుభవం, వేతనం, నెట్వర్కింగ్ అనే అంశాల ఆధారంగా ర్యాకింగ్ జాబితాను తయారు చేశారు.