దేశంలో ఐఎస్బీ నెం.1
ABN , First Publish Date - 2021-01-23T06:08:58+05:30 IST
ఎంబీఏ కోర్సులో దేశంలోనే హైదరాబాద్లోని ఇండియన్ బిజినెస్ స్కూల్ (ఐఎ్సబీ) అగ్రస్థానంలో నిలిచింది.
బిజినెస్ స్కూల్సు్ లో అగ్రస్థానం
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): ఎంబీఏ కోర్సులో దేశంలోనే హైదరాబాద్లోని ఇండియన్ బిజినెస్ స్కూల్ (ఐఎ్సబీ) అగ్రస్థానంలో నిలిచింది. ‘ఎకనమిస్ట్’ ఇచ్చిన ఫుల్ టైమ్ ఎంబీఏ ర్యాంకింగ్ 2021లో భారత్లో మొదటి స్థానంలో నిలిచినట్లు ఐఎ్సబీ డీన్ రాజేంద్ర శ్రీవాత్సవ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 44వ స్థానంలో ఉన్నట్లు చెప్పారు. 2019, 2020 పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రొగామ్స్ (పీజీపీ) ఆధారంగా ఎకనమిస్ట్ ఈ ర్యాంకులను ఇచ్చింది. ఎకనమిస్ట్ ర్యాంకింగ్లో ఐఎ్సబీ పాల్గొనడం ఇదే మొదటిసారి.