TPT : వారెవ్వా.. యేమి సేవ బాసూ.. విస్తుపోతున్న జనం!
ABN , First Publish Date - 2022-03-03T12:25:58+05:30 IST
వారెవ్వా.. యేమి సేవ బాసూ.. విస్తుపోతున్న జనం!
చిత్తూరు సిటీ : మద్యంతో ప్రజల బతుకులు నాశనం అయిపోతున్నాయని బాధపడ్డారు. అధికారంలోకి వస్తే సంపూర్ణ మద్యనిషేధం అంటూ నమ్మించారు. గద్దెనెక్కాక విడతలవారీగా చేస్తామని చెప్పారు. ఇప్పుడేమో ఏకంగా రకరకాల కొత్త విధానాలతో మద్యాన్ని ప్రజలకు చేరువ చేస్తున్నారు. ఇదిగో చిత్తూరులో బుధవారం మొదలైన ఈ మద్యం దుకాణమే అందుకు ఉదాహరణ. సూపర్మార్కెట్ తరహాలో కోరుకున్న బ్రాండ్లను ఎంచుకోవడానికి వీలుగా ఎలైట్ వైన్ షాప్ను పలమనేరు రోడ్డులో ప్రారంభించారు. ఎక్సైజ్ సీఐ లావణ్య ఈ వైన్షాప్ని ప్రారంభించడం విశేషం. ప్రభుత్వం మద్యం విక్రయాలు పెంచుకునేందుకు ఇలాంటి మాల్స్ను జిల్లావ్యాప్తంగా ప్రారంభించనుంది. ఇందువల్ల కటకటాల వెనుక నిలబడి ఎగబడి మద్యం కొనుక్కోవాల్సిన కష్టం తప్పుతుందన్నమాట. ‘హబ్బా.. ప్రజాసేవకు కొత్త అర్థం చెబుతోంది ప్రభుత్వం’ అని ఈ సూపర్ వైన్షాప్ను చూసి విస్తుపోతున్నారు దారినపోయే జనం.