బాడుగ ఇవ్వకుండా ఇదేం శిక్ష?!

ABN , First Publish Date - 2020-11-30T09:28:23+05:30 IST

రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర శిక్షా అభియాన్‌(ఎ్‌సఎ్‌సఏ)లో అధికారులు వినియోగిస్తున్న కార్ల(అద్దె కార్లు)కు మూడు నెలల నుంచి అద్దెలు చెల్లించడంలేదు.

బాడుగ ఇవ్వకుండా ఇదేం శిక్ష?!

తీవ్ర ఆర్థికంగా ఇబ్బందుల్లో ఓనర్‌ కమ్‌ డ్రైవర్లు


అమరావతి, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర శిక్షా అభియాన్‌(ఎ్‌సఎ్‌సఏ)లో అధికారులు వినియోగిస్తున్న కార్ల(అద్దె కార్లు)కు మూడు నెలల నుంచి అద్దెలు చెల్లించడంలేదు. దీంతో కార్ల ఓనర్‌ కమ్‌ డ్రైవ ర్లు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి జిల్లాలోనూ సగటున 15 కార్ల చొప్పున.. అద్దె ప్రాతిపదికన ఈ శాఖ అధికారులు వినియోగిస్తున్నా రు. కిలోమీటరు రూ.14 చొప్పున నెలకు 2,500 కిలోమీటర్ల వరకు తిరగాలి. ప్రతి నెలా ఐదో తేదీన బిల్లు మంజూరు చేయాలి. ఎస్‌ఎ్‌సఏ అద్దెకు తీసుకున్న వాహనాల్లో ఎక్కువ మంది ఓనర్‌ కమ్‌ డ్రైవర్లు. 3 నెలల నుంచి బిల్లు లు చెల్లించకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. సుమారు రూ.1.5 కోట్ల మేర బిల్లులు పేరుకున్నట్లు తెలుస్తోంది.

Updated Date - 2020-11-30T09:28:23+05:30 IST