అధికార పార్టీ వారికే పథకాలా?
ABN , First Publish Date - 2021-07-28T05:06:11+05:30 IST
రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ పథకాలు అందిస్తున్నట్టు ప్రచారం చేసుకుంటున్నా అవి వాస్తవ పరిస్థితులకు విరుద్ధంగా ఉన్నాయని టీడీపీ నాయకులు ఆరోపించారు. మంగళవా రం స్థానిక పార్టీ కార్యాలయంలో పార్లమెంటరీ పార్టీ ప్రధాన కార్య దర్శి పీరుకట్ల విఠల్రావు, సీనియర్ నాయకులు లొడగల కామేశ్వరరావు యాదవ్, పార్టీ పట్టణ అధ్యక్షుడు బడ్డ నాగరాజు, ప్రధాన కార్యదర్శి సప్ప నవీన్ విలేఖరులతో మాట్లాడారు. పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీలో అర్హత ఉన్నా అనేక మంది రాజకీయ వివక్షతతో నష్టపోతున్నారన్నారు.
టీడీపీ నాయకులు
పలాస, జూలై 27: రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ పథకాలు అందిస్తున్నట్టు ప్రచారం చేసుకుంటున్నా అవి వాస్తవ పరిస్థితులకు విరుద్ధంగా ఉన్నాయని టీడీపీ నాయకులు ఆరోపించారు. మంగళవా రం స్థానిక పార్టీ కార్యాలయంలో పార్లమెంటరీ పార్టీ ప్రధాన కార్య దర్శి పీరుకట్ల విఠల్రావు, సీనియర్ నాయకులు లొడగల కామేశ్వరరావు యాదవ్, పార్టీ పట్టణ అధ్యక్షుడు బడ్డ నాగరాజు, ప్రధాన కార్యదర్శి సప్ప నవీన్ విలేఖరులతో మాట్లాడారు. పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీలో అర్హత ఉన్నా అనేక మంది రాజకీయ వివక్షతతో నష్టపోతున్నారన్నారు. ముఖ్యంగా చైర్మన్ నివాసం ఉంటున్న 24వ వార్డులో కక్షపూ రితంగా చేయూత, వాహనమిత్ర వంటి పథకాలు ఇవ్వడం లేదన్నారు. దీనిపై మునిసిపల్ కమిషనర్, ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం కనిపించడం లేదన్నారు. ఇదేనా రాజకీయాలకు అతీతమైన పాలన అని ప్రశ్నించారు. సమావేశంలో గాలి కృష్ణారావు, టంకాల రవి శంకర్గుప్తా తదితరులు పాల్గొన్నారు. దివంగత రాష్ట్ర పతి అబ్దుల్ కలాం వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.