ఇక ‘నిర్భయ’మేనా!?
ABN , First Publish Date - 2020-03-21T05:50:36+05:30 IST
‘నిర్భయ’ కేసులో ఏడేళ్లకు పైగా సాగిన సుదీర్ఘ న్యాయ పోరాటం... చివరకు నేరస్థులకు ఉరితో ముగిసింది. ఎట్టకేలకు న్యాయం లభించిందని దోషులను ఉరితీసిన అనంతరం
‘నిర్భయ’ కేసులో ఏడేళ్లకు పైగా సాగిన సుదీర్ఘ న్యాయ పోరాటం... చివరకు నేరస్థులకు ఉరితో ముగిసింది. ఎట్టకేలకు న్యాయం లభించిందని దోషులను ఉరితీసిన అనంతరం శుక్రవారం ఉదయం ఢిల్లీలోని తీహార్ జైలు వద్ద ఆమె తల్లి ఆశాదేవి, బంధువులు సంతోషం వ్యక్తం చేశారు. కానీ... ఈ మరణదండన ఇకపై ఇలాంటి హత్యాచారాలకు అడ్డుకట్ట వేస్తుందా? నేరం చేయాలనే ఆలోచన వచ్చినవారికి వెన్నులో వణుకు పుట్టిస్తుందా? దేశంలో ఆడపిల్ల నిర్భయంగా తిరగగలుగుతుందా? ఇది జవాబు లేని ప్రశ్నే!