ఈమె ఓ తల్లేనా..? రెండో పెళ్లి కోసం.. 28ఏళ్ల మహిళ ఎంత నీచానికి దిగజారిందో తెలిస్తే..!

ABN , First Publish Date - 2021-10-03T16:25:48+05:30 IST

ఏ తల్లికైనా..

ఈమె ఓ తల్లేనా..? రెండో పెళ్లి కోసం.. 28ఏళ్ల మహిళ ఎంత నీచానికి దిగజారిందో తెలిస్తే..!

ఇంటర్‌నెట్‌డెస్క్: ఏ తల్లికైనా పిల్లలంటే అమితమైన ప్రేమ ఉంటుంది. కుటుంబ గొడవల కారణంగా భర్తతో విడిపోయిన.. పిల్లలే ప్రపంచంగా బతుకుతుంది. ఓ మహిళ భర్తతో విడిపోయి రెండో పెళ్లికి సిద్ధమైంది. కానీ ఆమెకు తన బిడ్డ అడ్డురావడంతో ఓ నీచానికి పాల్పడింది. పెళ్లికోసం బిడ్డను కాదనుకుని దారుణానికి పాల్పడింది. ఈ సంఘటన తమిళనాడులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..


తమిళనాడు విరుద్‌నగర్ జిల్లాకు చెందిన మణికందన్(38) అనే వ్యక్తికి, జెబామలర్(28) అనే మహిళతో 2019లో వివాహం జరిగింది. వారికి 9నెలల కుమారుడు ఉన్నాడు. పెళ్లైన ఏడాది వరకు బాగానే ఉన్నారు. ఆ తర్వాత నుంచి ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు తలెత్తేవి. అవి పెద్దవి కావడంతో.. కలిసి ఉండడం ఇష్టంలేక విడాకులు తీసుకున్నారు. కుమారుడిని తీసుకుని జెబామలర్ పుట్టింటికి వెళ్లిపోయింది. 



28ఏళ్లకే జెబామలర్ జీవితం ఇలా అయిపోయిందే.. అని తల్లిదండ్రులు తీవ్రంగా బాధపడేవారు. ఆమెకు ఇంకా ఎంతో భవిష్యత్తు ఉందని భావించిన తల్లిదండ్రులు.. రెండో పెళ్లి చేయాలనుకున్నారు. ఎన్ని సంబంధాలు చూసిన బిడ్డ ఉన్నాడనే కారణంతో ఎవరూ ముందుకు రాలేదు. తన రెండో పెళ్లికి కుమారుడే అడ్డుగా ఉన్నాడని జబామలర్ నీచానికి పాల్పడింది. ఎలాగైనా కుమారుడిని అమ్మేయాలని నిశ్చయించుకుంది. 


తల్లిదండ్రులు, సోదరుడితో కలిసి బ్రోకర్లను సంప్రదించింది. వారి సాయంతో సెల్వమణి, శ్రీదేవి అనే దంపతులకు రూ.3లక్షలకు అమ్మేసింది. కుమారుడిని అమ్మేశారని తండ్రి మణికందన్‌కు తెలిసింది. ‘‘నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా.. వచ్చి నీ కొడుకుని తీసుకెళ్లు అని చెప్పింటే.. నేను వచ్చేవాడిని కదా.. అమ్మేయడానికి మనసెలా వచ్చింది’’అని జబామలర్‌తో మణికందన్ వాగ్వాదానికి దిగాడు. పోలీసులకు ఫిర్యాదు చేసి తన బిడ్డను కాపాడాలని విజ్ఞప్తి చేశాడు. పోలీసులు రంగంలోకి దిగి బాలుడిని తిరిగి తండ్రికి అప్పగించారు. బాబును కొనుగోలు చేసిన దంపతులతో పాటు బ్రోకర్లను అరెస్టు చేశారు. పోలీసులు వస్తున్నారని తెలిసి జెబామలర్, ఆమె తల్లిదండ్రులు పారిపోయారు. పోలీసులు వారికోసం గాలిస్తున్నారు.

Updated Date - 2021-10-03T16:25:48+05:30 IST