సమీర్ వాంఖడే మరదలు drug business చేస్తోందా? మంత్రి నవాబ్ మాలిక్ ఆరోపణ

ABN , First Publish Date - 2021-11-08T16:35:08+05:30 IST

నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో అధికారి సమీర్ వాంఖడేపై మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ సోమవారం కొత్త ఆరోపణలు చేశారు...

సమీర్ వాంఖడే మరదలు drug business చేస్తోందా? మంత్రి నవాబ్ మాలిక్ ఆరోపణ

ముంబై : నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో అధికారి సమీర్ వాంఖడేపై మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ సోమవారం కొత్త ఆరోపణలు చేశారు. ఎన్సీబీ అధికారి సమీర్ వాంఖడే మరదలు హర్షదా దీనానాద్ రెడ్కర్‌కు డ్రగ్ వ్యాపారంలో ప్రమేయం ఉందా ? అంటే అవునంటున్నారు మంత్రి నవాబ్ మాలిక్. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్‌ అక్రమ రవాణా నిరోధక చట్టం కింద 2008లో నమోదైన కేసులో సమీర్ మరదలు హర్షదా దీనానాథ్ రెడ్కర్ జాబితా చేయబడినట్లు రుజువుని మంతి చూపించారు.‘‘సమీర్ దావూద్ వాంఖడే... మీ మరదలు హర్షదా దీనానాథ్ రెడ్కర్ డ్రగ్స్ వ్యాపారంలో పాలుపంచుకున్నారా? ఆమె కేసు పూణే కోర్టులో పెండింగ్‌లో ఉన్నందున మీరు సమాధానం చెప్పాలి.’’ అని మంత్రి నవాబ్ ట్వీట్ చేశారు.


నవాబ్ మాలిక్ తాజా ఆరోపణపై సమీర్ వాంఖడే స్పందించారు. జనవరి 2008లో తన మరదలు కేసు జరిగినప్పుడు తాను సర్వీసులో కూడా లేనని సమీర్ చెప్పారు. తాను 2017లో క్రాంతి రెడ్కర్‌ను మాత్రమే వివాహం చేసుకున్నానని, తనకు మరదలు హర్షదా దీనానాథ్ రెడ్కర్ తో  ఏ విధంగా సంబంధం ఉందని సమీర్ ప్రశ్నించారు. మరోవైపు సమీర్ వాంఖడే తండ్రి ధ్యాన్‌దేవ్ కచ్రూజీ వాంఖడే నవాబ్ మాలిక్‌పై బాంబే హైకోర్టులో పరువు నష్టం దావా వేశారు. ‘‘మంత్రి నవాబ్ మాలిక్ వాంఖడే కుటుంబాన్ని మోసగాళ్లని, వారి మత విశ్వాసాలను ప్రశ్నిస్తున్నారని వాంఖడే తరపు న్యాయవాది అర్షద్ షేక్ ఆరోపించారు.తన కుటుంబసభ్యుల గురించి మీడియాలో మాట్లాడకుండా నవాబ్ మాలిక్ ను నిరోధించాలని ధ్యాన్ దేవ్ మాలిక్ కోర్టును అభ్యర్థించారు.


Updated Date - 2021-11-08T16:35:08+05:30 IST