పోలవరం ముఖ్యమా? అమరావతా!: అనిల్‌

ABN , First Publish Date - 2020-12-05T09:26:41+05:30 IST

శాసనమండలిలో రాజధాని అమరావతిపై చర్చ జరగాలని టీడీపీ పట్టుపట్టింది. అధికార పార్టీ సభ్యులు పోలవరంపై చర్చ జరగాలని పట్టుపట్టారు.

పోలవరం ముఖ్యమా? అమరావతా!: అనిల్‌

అమరావతి, డిసెంబరు 4(ఆంఽధ్రజ్యోతి): శాసనమండలిలో రాజధాని అమరావతిపై చర్చ జరగాలని టీడీపీ పట్టుపట్టింది. అధికార పార్టీ సభ్యులు పోలవరంపై చర్చ జరగాలని పట్టుపట్టారు. ఈ సందర్భంగా మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌... ‘‘మీకు పోలవరం ముఖ్యమా? అమరావతి ముఖ్యమా?’’ అని ప్రశ్నించారు. మంత్రి మాట్లాడే సమయానికి పెండింగ్‌లో ఉన్న ఉపాధి బిల్లులను ప్రభుత్వం వెంటనే చెల్లించాలంటూ టీడీపీ సభ్యులు నిరసన తెలుపుతున్నారు. దానిని పట్టించుకోకుండా మంత్రి మాట్లాడడం మొదలు పెట్టడంతో...టీడీపీ సభ్యులు ‘‘స్వామియే అయ్యప్పో..’’ అంటూ అయ్యప్ప భజన చేశారు. కాగా, ‘టీడీపీకి పబ్లిసిటీ కావాలి. సమస్య పరిష్కారం కాదు’ అని మంత్రి బొత్స విమర్శించారు. అమరావతిపై అంత ప్రేమే ఉంటే ముందుగా బిజినెస్‌ ఎడ్వైజరీ కమిటీలో టీడీపీ ఎందుకు పెట్టలేదని నిలదీశారు. రాజకీయ, స్వార్థ ప్రయోజనాల కోసమే అమరావతిపై చర్చకు పట్టుబడుతున్నారని విమర్శించారు.  

Updated Date - 2020-12-05T09:26:41+05:30 IST