పేటీఎంలో వాటా విక్రయానికి చైనా గ్రూప్ సన్నాహాలు ?

ABN , First Publish Date - 2020-12-03T23:32:49+05:30 IST

డిజిటల్ చెల్లింపుల్లో దిగ్గజసంస్థ పేటీఎంలో తనకున్న 30 శాతం వాటాను విక్రయించేందుకు చైనా ఫిన్‌టెక్ సంస్థ యాంట్ గ్రూప్ సన్నాహాలు చేస్తున్నట్లు వినవస్తోంది. భారత్-చైనా మధ్య ఉద్రిక్తతలు చోటుచేసుకున్న నేపథ్యంలో ఆయా అంశాలు, రంగాలపై నిబంధనలు కఠినంగా మారుతోన్న విషయం తెలిసిందే.

పేటీఎంలో వాటా విక్రయానికి చైనా గ్రూప్ సన్నాహాలు ?

బీజింగ్ : డిజిటల్ చెల్లింపుల్లో దిగ్గజసంస్థ పేటీఎంలో తనకున్న 30 శాతం వాటాను విక్రయించేందుకు చైనా ఫిన్‌టెక్ సంస్థ యాంట్ గ్రూప్ సన్నాహాలు చేస్తున్నట్లు వినవస్తోంది. భారత్-చైనా మధ్య ఉద్రిక్తతలు చోటుచేసుకున్న నేపథ్యంలో ఆయా అంశాలు, రంగాలపై నిబంధనలు కఠినంగా మారుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యాంట్ గ్రూప్... పేటీఎం నుండి బయటకు వెళ్లాలని భావిస్తున్నట్లు వినవస్తోంది. కాగా... ఈ వార్తలపై యాంట్ గ్రూప్ కూడా స్పందించింది.


పేటీఎంలో యాంట్ గ్రూప్ వ్యాల్యూ ఎంతంటే... 

ఏడాది క్రితం జరిగిన ప్రైవేటు నిధుల సమీకరణ సమయంలో పేటీఎం విలువ  16 బిలియన్ డాలర్లు(దాదాపు రూ. 1.2 లక్షల కోట్లు)గా ఉందని లెక్కగట్టారు. పేటీఎంలో సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ సహా మరికొన్ని సంస్థల పెట్టుబడులు ఉన్నాయి. కాగా... వాటా విక్రయ వార్తలపై  స్పందించిన యాంట్, పేటీఎం గ్రూపు ఈ విక్రయం వార్తలను కొట్టివేశాయి. 


Updated Date - 2020-12-03T23:32:49+05:30 IST