ఐఆర్‌ఎఫ్‌సీ ఐపీవో... 18 నుంచి ...

ABN , First Publish Date - 2021-01-15T19:15:10+05:30 IST

పీఎస్‌యూ సంస్థ ఇండియన్‌ రైల్వే ఫైనాన్స్‌ కార్పొరేషన్‌(ఐఆర్‌ఎఫ్‌సీ) పబ్లిక్‌ ఇష్యూ ఈ నెల 18 న ప్రారంభం కానుంది. తద్వారా కంపెనీ రూ. 4,600 కోట్లను సమీకరించే ప్రణాళికల్లో ఉన్నట్లు పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ సంస్థ(దీపమ్‌) కార్యదర్శి టీకే పాండే వెల్లడించారు.

ఐఆర్‌ఎఫ్‌సీ ఐపీవో... 18 నుంచి ...

న్యూఢిల్లీ : పీఎస్‌యూ సంస్థ ఇండియన్‌ రైల్వే ఫైనాన్స్‌ కార్పొరేషన్‌(ఐఆర్‌ఎఫ్‌సీ) పబ్లిక్‌ ఇష్యూ ఈ నెల 18 న ప్రారంభం కానుంది. తద్వారా కంపెనీ రూ. 4,600 కోట్లను సమీకరించే ప్రణాళికల్లో ఉన్నట్లు పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ సంస్థ(దీపమ్‌) కార్యదర్శి టీకే పాండే వెల్లడించారు. ఈ నెల 20 న ముగియనున్న ఐపీవోకు ధరల శ్రేణి రూ.  25–26 గా తెలిపారు. ఇష్యూలో భాగంగా యాంకర్‌ ఇన్వెస్టర్లకు ఈ నెల 15 న షేర్లను కేటాయించనున్నట్లు పేర్కొన్నారు. ముఖ విలువ రూ. 10 కాగా.. రిటైల్‌ ఇన్వెస్టర్లు కనీసం 575 షేర్లకు(ఒక లాట్‌) దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది.  


178 కోట్ల షేర్లు...

పబ్లిక్‌ ఇష్యూలో భాగంగా కేంద్ర ప్రభుత్వం 178.2 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచనుంది. వీటిలో ప్రభుత్వం 59.4 కోట్ల షేర్లను ఆఫర్‌ చేయనుంది. మరో 118.8 కోట్ల షేర్లను తాజాగా జారీ చేయనుంది. ఇష్యూ ద్వారా ప్రభుత్వం రూ. 1,544 కోట్లు సమీకరించుకోనుంది. వెరసి తొలిసారి రైల్వేరంగ ఎన్‌బీఎఫ్‌సీ స్టాక్‌ మార్కెట్లలో లిస్ట్‌కానున్నట్లు నిపుణులు వెల్లడించారు. 1986 లో ఏర్పాటైన ప్రభుత్వరంగ సంస్థ ఐఆర్‌ఎఫ్‌సీ ప్రధానంగా దేశ, విదేశీ ఫైనాన్షియల్‌ మార్కెట్ల నుంచి చౌకగా నిధులను సమీకరిస్తుంటుంది. తద్వారా దేశీ రైల్వే విభాగానికి ఆస్తుల కొనుగోలు, ఫైనాన్సింగ్‌ తదితర సేవలను అందిస్తుంటుంది. అంతేకాకుండా దేశీ రైల్వేల అధిక బడ్జెటరీ వ్యయాలకు అవసరమైన నిధులు సమకూర్చుతుంది.  


కాగా...  రైల్వే కంపెనీలను స్టాక్‌ ఎక్సే్ఛంజీలలో లిస్ట్‌ చేసేందుకు 2017 ఏప్రిల్‌లో కేంద్ర కేబినెట్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఫలితంగా ఇర్కాన్‌(ఐఆర్‌సీవోఎన్‌) ఇంటర్నేషనల్, రైట్స్‌(ఆర్‌ఐటీఈఎస్‌), రైల్‌ వికాస్‌ నిగమ్, రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌(ఐఆర్‌సీటీసీ)అు ఎక్స్ఛేంజీల్లో ఇప్పటికే లిస్టయ్యాయి.


Updated Date - 2021-01-15T19:15:10+05:30 IST