సాగునీరు లేక...

ABN , First Publish Date - 2021-04-11T05:17:10+05:30 IST

సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయి. వంశధార కాలువల ద్వారా నీరు సరఫరా కాకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సాగునీరు లేక...
వేరుశనగ పంటను తడుపుతున్న రైతులు

పోలాకి : సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయి. వంశధార కాలువల ద్వారా నీరు సరఫరా కాకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రియాగ్రహారం, బెలమర, పాలవలస,  చెల్లాయి వలస, అంబీరుపేట, సుసరాం, గంగివలస, ఉరజాం, తలసముద్రం, దీర్గాశి ప్రాంతాల్లో అధిక విస్తీర్ణంలో వేరుశెనగ పంట సాగుచేస్తున్నారు. శనివారం కొంతమంది రైతులు ఇలా బోర్లు వద్ద వేరుశనగ పంటను తడుపుతూ రక్షించుకుంటున్నారు. పూర్తిస్థాయిలో సాగునీరు అందిస్తామని పాలకులు చెబుతున్నారే తప్ప, వాస్తంగా కనిపించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


Updated Date - 2021-04-11T05:17:10+05:30 IST