ఇరిగేషన్ కార్యాలయం ప్రారంభం
ABN , First Publish Date - 2021-09-18T06:48:25+05:30 IST
ఇరిగేషన్ కార్యాలయం ప్రారంభం
విజయవాడ, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి) : నగరంలో రూ.16.23 కోట్లతో నిర్మించిన ఇరిగేషన్ శాఖ నూతన కార్యాలయ భవనాన్ని జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పి.అనిల్కుమార్ యాదవ్ శుక్రవారం ప్రారంభించారు. ఇరిగేషన్ కార్యాలయాలన్నీ ఒకేచోట ఉండేలా ఈ నూతన భవనాన్ని నిర్మించామని మంత్రి తెలిపారు. నాలుగు అంతస్తుల్లో మొత్తం కార్యాలయాలు కొలువుతీరాయన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మేయర్ భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ దుర్గ, వ్యవసాయ కమిటీ చైర్మన్ నాగిరెడ్డి, జలవనరుల శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు, ఇంజనీర్ ఇన్ చీఫ్ సి.నారాయణరెడ్డి పాల్గొన్నారు.