సరస్వతీ కాలువ ద్వారా సాగునీటి విడుదల
ABN , First Publish Date - 2021-04-18T05:58:45+05:30 IST
జిల్లా వరప్రదాయిని సరస్వతీ కాలువ ద్వారా ఎస్సారెస్పీ అధికారులు శనివారం సాగునీరు విడుదల చేశారు.
సోన్, ఏప్రిల్ 17 : జిల్లా వరప్రదాయిని సరస్వతీ కాలువ ద్వారా ఎస్సారెస్పీ అధికారులు శనివారం సాగునీరు విడుదల చేశారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుండి సరస్వతి కాలువకు 300 క్యూసెక్యుల సాగునీరు విడుదల చేసినట్లు ఎస్సారెస్పీ అధికారులు తెలిపారు. ప్రస్తుతం రైతులు వేసుకున్న వరి, నువ్వు పంటలు చివరి దశలో ఉండటంతో సాగునీరు విడుదల చేయడంతో మరో కొన్ని రోజుల్లో పంటలు చేతికి వచ్చే అవకాశం ఉంది. సాగునీరు విడుల పట్ల మండల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.