ఐరన్వోర్ లారీ బోల్తా : డ్రైవర్, క్లీనర్కు గాయాలు
ABN , First Publish Date - 2022-05-26T03:38:27+05:30 IST
కర్నూలు జిల్లా బేతంచెర్ల నుంచి చెన్నై సమీపంలోని గుమ్మిడిపూడికి ఐరన్వోర్ లోడ్తో వెళుతున్న లారీ హైవేపై గుండవోలు గ్రామ మలు
బాధితులిద్దరూ కర్నూలు జిల్లా వాసులు
రాపూరు, మే 25: కర్నూలు జిల్లా బేతంచెర్ల నుంచి చెన్నై సమీపంలోని గుమ్మిడిపూడికి ఐరన్వోర్ లోడ్తో వెళుతున్న లారీ హైవేపై గుండవోలు గ్రామ మలుపు వద్ద బుధవారం తెల్లవారుజామున అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో బేతంచెర్లకు చెందిన డ్రైవర్ ధనుంజయ, క్లీనర్ చంద్రశేఖర్కు గాయాలయ్యాయి.దీంతో హైవే అంబులెన్స్లో ప్రాఽథమిక చికిత్స చేసి, స్థానిక ప్రభుత్వాసుత్రికి తరలించి చికిత్స చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో లారీ ఓ పక్క నుజ్జునుజ్జుకాగా, హైవే రెయిలింగ్ దెబ్బతింది.