హైదరాబాద్: దిశ కమిషన్ విచారణకు ఐపీఎస్ అధికారి సజ్జనార్ హాజరు కానున్నారు. ఈ మేరకు త్రిసభ్య కమిటీ సమన్లు జారీ చేసింది. కమిటీ మంగళవారం లేదా బుధవారం సజ్జనార్ను విచారించే అవకాశం ఉంది. కాగా సోమవారం త్రిసభ్య కమిటీ ముందు ఎన్హెచ్ఆర్సీ బృందం హాజరుకానుంది. సజ్జనార్ను విచారించిన తర్వాత త్రిసభ్య కమిటీ మరోసారి సిట్ చీఫ్ మహేశ్ భగవత్ను విచారించనుంది.