మయాంక్ సెంచరీ.. చేతులెత్తేసిన రాజస్థాన్ బౌలర్లు

ABN , First Publish Date - 2020-09-28T02:19:40+05:30 IST

పంజాబ్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ షార్జాలో పరుగుల వర్షం కురిపిస్తున్నాడు. బంతి ఏదైనా స్టాండ్స్‌లోకి పంపడమే పనిగా పెట్టుకున్న

మయాంక్ సెంచరీ.. చేతులెత్తేసిన రాజస్థాన్ బౌలర్లు

షార్జా: పంజాబ్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ షార్జాలో పరుగుల వర్షం కురిపిస్తున్నాడు. బంతి ఏదైనా స్టాండ్స్‌లోకి పంపడమే పనిగా పెట్టుకున్న మయాంక్ 45 బంతుల్లో 9 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ బాదాడు. అతడి దెబ్బకు స్కోరుబోర్డు జెట్ స్పీడ్‌తో పరిగెడుతోంది. మరోవైపు, కెప్టెన్ లోకేశ్ రాహుల్ కూడా బ్యాట్ ఝళిపిస్తున్నాడు. చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వీరి బాదుడు ముందు రాజస్థాన్ బౌలర్లు చిన్నపిల్లలైపోయారు. బంతులు ఎలా వేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. వికెట్లు తీయలేక చేతులెత్తేశారు. ఇక, ఫీల్డర్లు అయితే ప్రేక్షకుల్లా మారిపోయారు. ప్రస్తుతం 16 ఓవర్లు ముగిశాయి. పంజాబ్ వికెట్ నష్టపోకుండా 178 పరుగులు చేసింది. రాహుల్ 67, మయాంక్ 102 పరుగులతో క్రీజులో ఉన్నారు. 

Updated Date - 2020-09-28T02:19:40+05:30 IST