విదేశీ ఆటగాళ్లు లేకుండా ఐపీఎల్?
ABN , First Publish Date - 2020-04-02T09:58:08+05:30 IST
ప్రస్తుత పరిస్థితులు మెరుగుపడితే ఐపీఎల్ను విదేశీ ఆటగాళ్లు లేకుండా నిర్వహించవచ్చునని రాజస్థాన్ రాయల్స్ సీఈఓ రంజిత్ బర్థాకూర్ అన్నారు...
ముంబై: ప్రస్తుత పరిస్థితులు మెరుగుపడితే ఐపీఎల్ను విదేశీ ఆటగాళ్లు లేకుండా నిర్వహించవచ్చునని రాజస్థాన్ రాయల్స్ సీఈఓ రంజిత్ బర్థాకూర్ అన్నారు. ‘కేవలం భారత ప్లేయర్లతోనే మినీ ఐపీఎల్ను నిర్వహిస్తే ఎలా ఉంటుందని ఆలోచన చేస్తున్నాం. కరోనా ఉధృతి తగ్గితే ఐపీఎల్ను నిర్వహించేందుకు బీసీసీఐ సిద్ధంగా ఉంది. ఏదైనా ఐపీఎల్ నిర్వహణపై ఈనెల 15 తర్వాతే స్పష్టత వస్తుంద’ని చెప్పారు.