ఇక నుంచి ‘ఇంటా-బయటా’ ఐపీఎల్‌

ABN , First Publish Date - 2022-09-23T09:58:04+05:30 IST

కరోనా కారణంగా 2020 నుంచి ఐపీఎల్‌ను పరిమిత మైదానాల్లోనే నిర్వహిస్తూ వచ్చారు.

ఇక నుంచి ‘ఇంటా-బయటా’ ఐపీఎల్‌

న్యూఢిల్లీ: కరోనా కారణంగా 2020 నుంచి ఐపీఎల్‌ను పరిమిత మైదానాల్లోనే నిర్వహిస్తూ వచ్చారు. ఈ ఏడాది ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్‌, చెన్నైలోనే మ్యాచ్‌లు జరిగాయి. అయితే వచ్చే ఏడాది నుంచి ఐపీఎల్‌ తమ పాత పద్ధతిలోకి మారనుంది. దీంతో ఎప్పటిలాగే సొంత మైదానం-బయటి మైదానం తరహాలో మ్యాచ్‌లు జరుగుతాయని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ ప్రకటించాడు. ఇప్పటికే ఈ విషయమై ఆయా రాష్ట్ర సంఘాలకు సమాచారమందింది. ‘కరోనా ముందు వరకు  ప్రతీ జట్టుకు తమ సొంత మైదానంలో మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉండేది. కానీ గత మూడు సీజన్‌లలో అలా కుదరలేదు. వచ్చే ఏడాది నుంచి యధావిధిగా మ్యాచ్‌లు జరుగుతాయి’ అని దాదా తెలిపాడు.

Updated Date - 2022-09-23T09:58:04+05:30 IST