వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయిన ముంబై
ABN , First Publish Date - 2020-09-20T01:41:29+05:30 IST
ఐపీఎల్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్తో జరుగుతున్న తొలి మ్యాచ్లో ముంబై ఇండియన్స్ వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయింది.
అబుదాబి: ఐపీఎల్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్తో జరుగుతున్న తొలి మ్యాచ్లో ముంబై ఇండియన్స్ వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. సారథి రోహిత్ శర్మ అవుటైన వెంటనే డికాక్ కూడా పెవిలియన్ బాట పట్టాడు. 2 ఫోర్లతో 12 పరుగులు చేసిన రోహిత్.. చావ్లా బౌలింగ్లో శామ్ కరన్కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.
ఆ తర్వాత మరో మూడు బంతులకే డికాక్ కూడా అవుటయ్యాడు. 20 బంతుల్లో 5ఫోర్లతో 33 పరుగులు చేసిన డికాక్.. శామ్ కరన్ బౌలింగ్లో వాట్సన్కు దొరికిపోయాడు. ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్, సౌరభ్ తివారీలు క్రీజులో ఉన్నారు. ఆరు ఓవర్లు ముగిసేసరికి ముంబై రెండు వికెట్ల నష్టానికి 51 పరుగులు చేసింది.