20 కోట్ల మంది వీక్షణ
ABN , First Publish Date - 2020-09-23T09:10:36+05:30 IST
ప్రపంచంలో ఇప్పటివరకు ఏ క్రీడా పోటీ ఆరంభ మ్యాచ్కు లభించని రికార్డు స్థాయి వ్యూయర్షిప్ ఐపీఎల్-13వ సీజన్ తొలి మ్యాచ్కు దక్కింది...
ఐపీఎల్ తొలి మ్యాచ్ రికార్డు
న్యూఢిల్లీ: ప్రపంచంలో ఇప్పటివరకు ఏ క్రీడా పోటీ ఆరంభ మ్యాచ్కు లభించని రికార్డు స్థాయి వ్యూయర్షిప్ ఐపీఎల్-13వ సీజన్ తొలి మ్యాచ్కు దక్కింది. గత శనివారం అబుదాబిలో చెన్నై సూపర్ కింగ్స్-ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ను వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా 20 కోట్ల మంది వీక్షించినట్టు బ్రాడ్కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బీఏఆర్సీ) సర్వేలో వెల్లడైందని బీసీసీఐ కార్యదర్శి జైషా తెలిపారు.
టీ20 క్రికెట్లో ఐపీఎల్నే బెస్ట్: ప్రపంచ టీ20 క్రికెట్లో అత్యుత్తమ ప్రమాణాలు కలిగిన లీగ్ల జాబితాలో ఐపీఎల్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకొంది. క్రికెట్ క్వాలిటీ అండ్ డేటా ఎనాల్సిస్ సంస్థ ‘క్రిక్విజ్’ జరిపిన పరిశోధనలో.. ఐసీసీ టోర్నీలతో పాటు కరీబియన్ ప్రీమియర్ లీగ్, బిగ్బాష్, పాక్ సూపర్ లీగ్ వంటి ప్రముఖ లీగ్లన్నింటిని వెనక్కినెట్టి ఐపీఎల్ టాప్లో నిలిచింది.