ఢిల్లీ శిబిరంలో కొవిడ్ కల్లోలం: మారిన ఢిల్లీ-పంజాబ్ మ్యాచ్ వేదిక

ABN , First Publish Date - 2022-04-19T22:05:52+05:30 IST

ఢిల్లీ కేపిటల్స్ శిబిరంలో కరోనా కలకలం నేపథ్యంలో రేపు (బుధవారం) ఢిల్లీ-పంజాబ్ కింగ్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ ..

ఢిల్లీ శిబిరంలో కొవిడ్ కల్లోలం: మారిన ఢిల్లీ-పంజాబ్ మ్యాచ్ వేదిక

ముంబై: ఢిల్లీ కేపిటల్స్ శిబిరంలో కరోనా కలకలం నేపథ్యంలో రేపు (బుధవారం) ఢిల్లీ-పంజాబ్ కింగ్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వేదిక మారింది. ఈ రెండు జట్ల మధ్య పూణెలోని ఎంసీఏ స్టేడియంలో ఐపీఎల్ 32వ మ్యాచ్ జరగాల్సి ఉండగా దానిని ముంబైలోని బ్రాబౌర్న్ స్టేడియానికి మార్చినట్టు బీసీసీఐ ప్రకటించింది. ప్రస్తుత పరిస్థితుల్లో బస్సులో అంత దూరం ప్రయాణం చేయడం సురక్షితం కాదన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.


ఢిల్లీ కేపిటల్స్ శిబిరంలో మొత్తం ఐదుగురు కరోనా బారినపడ్డారు. జట్టు ఫిజియో పాట్రిక్ ఫర్హాత్ ఈ నెల 15న పాజిటివ్‌గా తేలగా, స్పోర్ట్స్ మసాజ్ థెరపిస్ట్ చేతన్ కుమార్ 16న, ఆటగాడు మిచెల్ మార్ష్, టీం డాక్టర్ అభిజిత్ సాల్వీ, సోషల్ మీడియా కంటెంట్ టీం సభ్యుడు ఆకాశ్ మానే 18న కరోనా బారినపడ్డారు. ఈ రోజు నాలుగో విడత వారికి నిర్వహించిన ఆర్టీపీసీఆర్ టెస్టులో నెగటివ్ అనే తేలింది. రేపు (గురువారం) ఉదయం మరోమారు వీరికి ఆర్టీ పీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తారు. కరోనా బారినపడి ఆసీస్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.  


Updated Date - 2022-04-19T22:05:52+05:30 IST