5 వికెట్లతో రస్సెల్ అదుర్స్.. కేకేఆర్ టార్గెట్ ఎంతంటే..

ABN , First Publish Date - 2021-04-14T02:55:31+05:30 IST

ముంబై ఇండియన్స్-కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో కేకేఆర్ బౌలర్లు అదరగొట్టారు. మొదటి బంతి నుంచి కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ ముంబై బ్యాట్స్‌మన్‌ కట్టడి చేశారు. అంతేకాకుండా క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ ప్రత్యర్థిపై ఒత్తిడి..

5 వికెట్లతో రస్సెల్ అదుర్స్.. కేకేఆర్ టార్గెట్ ఎంతంటే..

చెన్నై: ముంబై ఇండియన్స్-కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో కేకేఆర్ బౌలర్లు అదరగొట్టారు. మొదటి బంతి నుంచి కట్టుదిట్టంగా  బౌలింగ్ చేస్తూ ముంబై బ్యాట్స్‌మన్‌ కట్టడి చేశారు. అంతేకాకుండా క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచారు. దీంతో ముంబై ఇండియన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆలౌటై 152 పరుగులు చేసింది. ముంబై బ్యాట్స్‌మెన్‌లలో సూర్యకుమార్ యాదవ్(56: 36 బంతుల్లో.. 7 ఫోర్లు, 2 సిక్సులు) అర్థ సెంచరీతో మెరిశాడు. కెప్టెన్ రోహిత్ శర్మ(43: 32 బంతుల్లో.. 3 ఫోర్లు, 1 సిక్స్) అర్థసెంచరీ మిస్ చేసుకున్నాడు. వీరిద్దరూ మినహా మిగతా బ్యాట్స్‌మెన్ ఎవరూ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు.


ఇక ఈ మ్యాచ్‌లో కేకేఆర్ ఆల్‌రౌండర్ ఆండ్రూ రస్సెల్ బౌలింగ్‌లో విజృంభించాడు. రెండు ఓవర్లే వేసినా 5 వికెట్లు తీసి ముంబైను కోలుకోలేని దెబ్బ కొట్టాడు. అంతేకాకుండా రెండు ఓవర్లలోనూ కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చి పరుగులను కట్టడి చేశాడు. మిగతా బౌలర్లలో ప్యాట్ కమిన్స్ 2 వికెట్లు తీయగా.. ప్రసిద్ధ్ కృష్ణ, షకిబ్ అల్ హసన్, వరుణ్ చక్రవర్తిలు తలా ఓ వికెట్ దక్కించుకున్నారు. మరికొద్ది సేపట్లో కేకేఆర్ జట్టు 153 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగనుంది.

Updated Date - 2021-04-14T02:55:31+05:30 IST