ఐప్యాక్ డైరెక్టర్‌ పెళ్లికి హాజరుకానున్న సీఎం జగన్

ABN , First Publish Date - 2020-02-16T17:07:42+05:30 IST

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇవాళ సాయంత్రం లక్నో వెళ్ళనున్నారు...

ఐప్యాక్ డైరెక్టర్‌ పెళ్లికి హాజరుకానున్న సీఎం జగన్

విజయవాడ : ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇవాళ సాయంత్రం లక్నో వెళ్ళనున్నారు. లక్నోలో ఓ వివాహానికి హాజరు కానున్నారు. వివాహం అనంతరం రాత్రికి విజయవాడకు తిరుగు పయనం చేయనున్నారు. కాగా.. 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ అఖండ మెజార్టీ సాధించడంలో ఐప్యాక్ (IPAC) టీమ్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.


ఈ ఐప్యాక్ డైరెక్టర్లలో ఒకరైన రుషి వివాహ వేడుకకు జగన్ హాజరు కాబోతున్నారు. ఈ వేడుకకు ఏపీకి సంబంధించిన ఒకరిద్దరు మంత్రులు కూడా హాజరవుతారని తెలుస్తోంది. ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కూడా పెళ్లికి హాజరుకాబోతున్నట్లు సమాచారం.

Updated Date - 2020-02-16T17:07:42+05:30 IST