హైదరాబాద్కు ఐఓసీ పైప్లైన్
ABN , First Publish Date - 2020-12-03T06:14:16+05:30 IST
వ్యాపార విస్తరణ ప్రణాళికలో భాగంగా రూ.1689 కోట్లతో ఇం డియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐ ఓసీ) వివిధ ప్రాజెక్టులు చేపడుతోంది.
ఏపీలో రూ. 1689 కోట్ల పెట్టుబడులు
ఐఓసీ హెడ్ (ఏపీ, తెలంగాణ) ఆర్ఎ్సఎస్ రావు
విజయవాడ (ఆంధ్రజ్యోతి): వ్యాపార విస్తరణ ప్రణాళికలో భాగంగా రూ.1689 కోట్లతో ఇం డియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐ ఓసీ) వివిధ ప్రాజెక్టులు చేపడుతోంది. ఏపీ - తెలంగాణా స్టేట్ హెడ్ ఆర్ఎ్సఎస్ రావు బుధవారం విజయవాడలో విలేకరు ల సమావేశంలో మాట్లాడుతూ ఒరిస్సా నుంచి ఏపీ మీదుగా తెలంగాణాకు భారీ పైప్లైన్కు శ్రీకారం చుట్టామని తెలిపారు. ఈ పైప్లైన్ ఏపీలో 723 కిలోమీటర్ల మేర ఉంటుందని, విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడలను కలుపుతూ హైదరాబాద్కు అనుసంధానం అవుతుందని చెప్పారు. విశాఖలో ఏర్పాటు చేసే నూతన టెర్మినల్కు ఈ పైప్లైన్ కనెక్ట్ అవుతుందన్నారు. వైజాగ్ సమీపంలోని అచ్యుతాపురం దగ్గర 60 ఎకరాల విస్తీర్ణంలో రూ. 468 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ టెర్మినల్ నిల్వ సామర్థ్యం 74 వేల కిలోలీటర్లని చెప్పారు.
ఇది కాకుండా నూతన బాట్లింగ్ ప్లాంట్తో పాటు డిపోలు, టెర్మినల్స్ , ట్యాంక్స్ వంటి మౌలిక సదుపాయాలను విస్తరిస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఐఓసీకి విశాఖపట్నం, కొండపల్లి, కడపలలో మూడు బాట్లింగ్ ప్లాంట్లున్నాయన్నారు. ఈ బాట్లింగ్ ప్లాంట్ల ద్వారా ప్రతి రోజూ లక్ష సిలిండర్లను సరఫరా చేయటం జరుగుతోందన్నారు. చిత్తూరు జిల్లాలో కొత్తగా రూ. 167 కోట్ల వ్యయంతో ఎల్పీజీ బాట్లింగ్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు.